ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

AP CM YS Jagan TS CM KCR Condolences Mulayam Singh Demise - Sakshi

తాడేపల్లి/హైదరాబాద్‌: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. 82 ఏళ్ల ములాయం అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ములాయం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ములాయం కీలక పాత్ర పోషించారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని సీఎం జగన్‌ సంతాప ప్రకటనలో తెలియజేశారు. 

ఇక ములాయం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం తన జీవితాంతం పని చేశారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ములాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top