
ఛండీగఢ్: భారత వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. పంజాబ్లోని పఠాన్కోట్ (Pathankot)లో భారత వాయుసేన అపాచీ హెలికాప్టర్-M17 అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
JK: Air Force #Apache helicopter #M17 makes emergency landing in Pathankot....... pic.twitter.com/dQSNmP6NYa
— Devesh , वनवासी (@Devesh81403955) June 13, 2025
అయితే, వారం రోజుల వ్యవధిలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.