ఢిల్లీ: దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలో శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్ 32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందివుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అలాగే విమానంలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ప్రాణనష్టం జరిగిందా? అనే వివరాలను వాయుసేన ఇంకా తెలియజేయలేదు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధికారికంగా స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.
An AN-32 transport aircraft of the Indian Air Force has met with an accident at the Jorhat Air Force station in Assam. More details are awaited: Indian Air Force pic.twitter.com/eeF23GDFEM
— ANI (@ANI) June 13, 2026
అస్సాంలో వాయుసేన విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చి 5వ తేదీన జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచే సాధారణ విమాన విన్యాసాల కోసం టేకాఫ్ అయిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్, గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయి కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని కొండ ప్రాంతంలో కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే ఇప్పుడు మరో రవాణా విమానం ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.


