కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలట్‌ మృతి? | Indian Air Force plane crashes in Assam | Sakshi
Sakshi News home page

కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలట్‌ మృతి?

Jun 13 2026 11:33 AM | Updated on Jun 13 2026 12:17 PM

Indian Air Force plane crashes in Assam

ఢిల్లీ: దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలో శనివారం ఉదయం  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్  32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. జోర్హాట్  ఎయిర్ బేస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్‌ మృతిచెందివుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 


ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అలాగే విమానంలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ప్రాణనష్టం జరిగిందా? అనే వివరాలను వాయుసేన ఇంకా తెలియజేయలేదు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధికారికంగా స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.

అస్సాంలో వాయుసేన విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చి 5వ తేదీన జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచే సాధారణ విమాన విన్యాసాల కోసం టేకాఫ్ అయిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్, గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయి కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని కొండ ప్రాంతంలో కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే ఇప్పుడు మరో రవాణా విమానం ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement