AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ | AIIMS Delhi: Brain tumor surgery for a five-year-old child | Sakshi
Sakshi News home page

AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ

Jan 7 2024 4:29 AM | Updated on Jan 7 2024 4:29 AM

AIIMS Delhi: Brain tumor surgery for a five-year-old child - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్‌ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది.

పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్‌) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దీపక్‌ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్‌ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్‌ దీపక్‌ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్‌ గుప్తా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement