ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి | 9 Killed in Arunachal After Landslide 5 Killed in Assam | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

Jun 1 2025 7:48 AM | Updated on Jun 1 2025 8:45 AM

9 Killed in Arunachal After Landslide 5 Killed in Assam

గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు  ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement