Mumbai: ఘోరం.. ట్రైన్‌ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం | 5 Feared Dead After Many Passengers Fall Off Overcrowded Local Train In Mumbai | Sakshi
Sakshi News home page

Mumbai: ఘోరం.. ట్రైన్‌ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం

Jun 9 2025 10:18 AM | Updated on Jun 9 2025 12:04 PM

5 Feared Dead After Many Passengers Fall Off Overcrowded Local Train In Mumbai

మహారాష్ట్ర:  ముంబైలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం (జూన్‌9) ఛత్రపతి శివాజీ మహరాజ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

దివా నుంచి ముంబ్రాకు ప్రయాణిస్తున్న లోకల్‌ ట్రైన్ నుంచి జారి ప‌డి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. 10 నుంచి 12 మంది ప్ర‌యాణికులు తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాద బాధితుల‌కు అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ముంబైలో విప‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగా లోక‌ల్ ట్రైన్  ప్ర‌యాణికులు ఫుట్ బోర్డింగ్‌లో ప్ర‌యాణించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే, ఇవాళ అలాగే ప్యాసింజ‌ర్లు  డోర్ల‌కు వేలాబ‌డుతూ ప్ర‌యాణించారు. ట్రైన్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికి కదులుతున్న ట్రైన్ నుంచి ప్ర‌యాణికులు అదుపుత‌ప్పి జారి కింద‌ప‌డ్డారు. దీంతో ప‌లువురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement