
మహారాష్ట్ర: ముంబైలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం (జూన్9) ఛత్రపతి శివాజీ మహరాజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది.
దివా నుంచి ముంబ్రాకు ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. 10 నుంచి 12 మంది ప్రయాణికులు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ముంబైలో విపరీతమైన రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ ప్రయాణికులు ఫుట్ బోర్డింగ్లో ప్రయాణించడం సర్వసాధారణం. అయితే, ఇవాళ అలాగే ప్యాసింజర్లు డోర్లకు వేలాబడుతూ ప్రయాణించారు. ట్రైన్ ప్రారంభమైన కొద్ది సేపటికి కదులుతున్న ట్రైన్ నుంచి ప్రయాణికులు అదుపుతప్పి జారి కిందపడ్డారు. దీంతో పలువురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm
— ANI (@ANI) June 9, 2025