Covid - 19 Update : 43,654 New Positive Cases Recorded In India - Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు

Jul 28 2021 10:32 AM | Updated on Jul 28 2021 1:30 PM

43654 New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,654 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 640 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,22,022 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 41,678  మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,06,63,147 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 3,99,436 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31.48 కోట్ల  మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 44.61 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement