ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది  మావోలు లొంగుబాటు  | 33 Naxalites Surrender In Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది  మావోలు లొంగుబాటు 

Apr 19 2025 5:58 AM | Updated on Apr 19 2025 9:00 AM

33 Naxalites Surrender In Chhattisgarh

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 33 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 17 మందిపై మొత్తం రూ.49 లక్షల రివార్డు ఉందని ఎస్‌పీ కిరణ్‌ చవాన్‌ చెప్పారు. వీరిలో 9 మంది మహిళలు సహా 22 మంది సీఆర్‌పీఎఫ్‌ ఎదుట, మరో ఇద్దరు మహిళలు సహా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. 

సైద్ధాంతిక బలం లేని మావోయిస్ట్‌ పార్టీ స్థానిక గిరిజనులపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నందునే తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వీరు చెప్పారన్నారు. లొంగిపోయిన వారిలో సుమారు 22 మంది ఛత్తీస్‌గఢ్‌లోని మా, ఒడిశాలోని నౌపడలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కిరణ్‌ చవాన్‌ వివరించారు. లొంగుబాట పట్టిన వారిలో ప్రముఖంగా పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్‌ ముచాకి జోగా(33), అతడి భార్య, అదే స్క్వాడ్‌కు చెందిన జోగి(28) ఉన్నారని వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్‌పీ చెప్పారు. ఇంకా కమిటీ సభ్యులైన కికిడ్‌ దెవె(30), మనోజ్‌లపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement