పంజాబ్‌లో విషాదం | 21 People Dead And 10 Hospitalized After Drinking Tainted Liquor In Amritsar Punjab, More Details Inside | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో విషాదం

May 14 2025 3:19 AM | Updated on May 14 2025 4:48 PM

21 people dead and 10 hospitalized after drinking tainted liquor

కల్తీ మద్యం తాగి 21 మంది మృతి

10 మంది పరిస్థితి విషమం

చండీగఢ్‌/అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 21 మంది అమాయకులు బలయ్యారు. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో 10 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సోమవారం రాత్రి ఐదు గ్రామాల నుంచి పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం సరఫరాకు కారకులైన పది మందిని అరెస్ట్‌చేశారు. మద్యం ప్రధాన సరఫరాదారు ప్రభ్‌జీత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రభ్‌జీత్‌ సింగ్‌ కీలక సరఫరాదారు సాహబ్‌సింగ్‌ పేరును వెల్లడించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎక్సయిజ్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

నకిలీ మద్యం ఏరులై పారుతున్నా నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వం వెంటనే మజీఠా డెప్యూటీ ఎస్పీ అమోలక్‌ సింగ్, మజీఠా పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అవతార్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేసింది. బాధిత కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి మాన్‌ సింగ్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబంలోని చిన్నారులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement