
పెద్దమ్మ జాతరకు వేళాయె!
గోస్పాడు: కుల, మత, రాజకీయాలకు అతీతంగా యాళ్లూరులో పెద్దమ్మ జాతరను నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 1926, 1966, 2015 సంవత్సరాల్లో గ్రామంలో జాతరను నిర్వహించారు. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో జాతర నిర్వహించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలలయం లేకపోవడంతో పూర్వం నుంచి వస్తున్న ఆచారం మేరకు అమ్మవారిని స్థానిక రామచావిడి ఎదుట ఏర్పాటు చేసి జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటితో ఉత్సవాలు ప్రారంభం
పెద్దమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మ వారి మహిషముల గ్రామ ఊరేగింపు ఉంటుంది. రాత్రి 8గంటలకు అన్నదానం, 10 గంటలకు అమ్మవారిని రామ చావిడికి తీసుకెళ్లి ఆశీనులను చేయనున్నారు. 30 తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారికి మహిషముల సమర్పణ, ఉదయం 5 గంటల నుంచి గ్రామంలో పొలి చల్లే కార్యక్రమం, ఉదయం బోనాల సమర్పణ, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం, సాయంత్రం 4గంటల నుంచి అమ్మవారికి గ్రామోత్సవం(దీవెన బండారు) నిర్వహిస్తారు.
జాతరకు అధిక ఖర్చు..
అమ్మవారికి మొక్కు తీర్చుకునే విషయంలో గ్రామ స్తులు ఖర్చుకు వెనుకాడటం లేదు. జాతరకు వ చ్చే బంధుమిత్రులకు మాంసాహార విందు ఇచ్చేందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఈలెక్కన గ్రామం మొత్తంపై దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు కావచ్చని గ్రామ పెద్దలు అంచనా వేస్తున్నారు.
ప్రశాంతంగా నిర్వహించాలి
జాతర ప్రశాంతంగా జరుపు కోవాలి. ఎలాంటి గొడవలకు తావులేకుండా జాతర పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలి. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవు. జాతర సందర్భంగా వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామ శివారులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంతో వాహనాలు నిలుపుకోవాలి. – ఎస్ఐ వెంకటప్రసాద్
యాళ్లూరులో 11 ఏళ్ల తర్వాత ఉత్సవం
గ్రామంలో పండగ సందడి

పెద్దమ్మ జాతరకు వేళాయె!