ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే? | Tollywood Tv Actress Vishnu Priya buys Luxury Bike photos | Sakshi
Sakshi News home page

Vishnu Priya: బీఎండబ్ల్యూ బైక్‌ కొన్న విష్ణు ప్రియ.. కారు ధర కంటే ఎక్కువే!

Apr 4 2025 5:20 PM | Updated on Apr 4 2025 5:50 PM

Tollywood Tv Actress Vishnu Priya buys Luxury Bike photos

బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి విష్ణు ప్రియ. తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11/ఏ ఏటిగట్టు అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ కూడా విడుదలైంది.

అయితే తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్‌ అయిన బీఎండబ్లూ బైక్‌ను కొనేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ బైక్ ధరలు దాదాపు లక్షల్లోనే ఉంటాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్‌లో వీటి ప్రారంభ ధరలే దాదాపు రూ.3 లక్షల నుంచి మొదలవుతాయి. విష్ణు ప్రియ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బైక్‌ ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement