'ప్రభాస్‌ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ' | Diretcor Krishna Maya Emotional Comments About Hero Prabhas Went Viral, Says He Can Give Me ₹2-3 Crore If I Ask | Sakshi
Sakshi News home page

Krishna Maaya: 'ప్రభాస్‌ను అడిగితే మూడు కోట్లు వెంటనే ఇచ్చేస్తాడు'

Jun 30 2026 3:51 PM | Updated on Jun 30 2026 5:08 PM

Tollywood diretcor Krishna Maya Comments about Hero Prabhas

ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా రాణించారు. టాలీవుడ్‌లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్‌లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్‌కు వచ్చారని తెలిపారు.

అప్పుడున్న ప్రభాస్‌కు.. ఇప్పుడున్న ప్రభాస్‌కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.

'ఇటీవల ఫౌజీ మూవీ టైమ్‌లో ప్రభాస్ దగ్గరికి వెళ్లా. ఆయన నా చేయి పట్టుకుని మరి నాతో మాట్లాడారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారు. ఒకవేళ నేను ప్రభాస్‌ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. అలా అడిగితే నా ఫ్రెండ్‌షిప్‌తో పాటు మర్యాద కూడా పొద్ది.. నాకు డబ్బులు అవసరం లేదు.. నాకు నేను సంపాదించుకుంటున్నా. ఆ టైమ్‌లో నన్ను చూసిన ప్రభాస్‌ ఒక పాత స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడు' అని కృష్ణ మాయ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్‌తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement