దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్లోని ఓ ఆస్తి లీజు వివాదానికి సంబంధించి దగ్గుబాటి సురేశ్బాబు, వెంకటేశ్లపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విచారణను ఈ దశలో నిలిపేయడం సరికాదంటూ దగ్గుబాటి సోదరులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.
హైదరాబాద్లోని ఓ ఆస్తిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చాక తెలెత్తిన వివాదంలో దగ్గుబాటి సోదరులపై దాఖలైన కేసును నాంపల్లి కోర్టు విచారిస్తోంది. లీజు ప్రాంగణంలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపించారు. ఈ కేసును కొట్టేయాలంటూ సురేశ్బాబు, వెంకటేశ్లు హైకోర్టును ఆశ్రయించారు.


