బ్లాక్‌ బస్టర్‌ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్‌ అయ్యారేంటి?

Srinu Vaitla, Bommarillu Bhaskar, Srikanth Addala, Sujatha, Buchi Babu Upcoming Movie Details - Sakshi

ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్‌ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్‌ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్‌ నెక్ట్స్‌?’ అనే చర్చ జరగడం కామన్‌ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్‌ అడ్డాల, విజయ్‌ కుమార్‌ కొండా, సంతోష్‌ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. 

లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్‌ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్‌.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్‌ తేజ్‌తో తీసిన ‘మిస్టర్‌’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్‌ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.


మరో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్‌ యాడ్‌ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్‌ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్‌ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్‌ అడ్డాల.

సేమ్‌ ఇలానే దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్‌ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు విజయ్‌ కుమార్‌ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్‌ బుజ్జిగా, పవర్‌ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్‌ తరుణ్‌తో తీసిన ‘పవర్‌ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్‌ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు.


శ్రీకాంత్‌ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్‌’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్‌ హిట్‌  అందుకున్నారు భాస్కర్‌. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్‌లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు.  అఖిల్‌ హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్‌ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌ అందుకుంది. అయితే తన నెక్ట్స్‌ సినిమాపై భాస్కర్‌ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక కెమెరామేన్‌  నుంచి దర్శకునిగా మారిన సంతోష్‌ శ్రీనివాస్‌ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్‌’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్‌’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్‌ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్‌  కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి.

సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్‌ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్‌ రాజా రన్‌(2014)’ తో మంచి హిట్‌ అందుకున్నారు సుజిత్‌. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్‌ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ దక్కించుకున్నారు. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్‌ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్‌. అయితే పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్‌. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి  దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా  నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్‌ సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన  వైష్ణవ్‌ తేజ్, కృతీశెట్టి ఫుల్‌ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు.

వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్‌ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్‌ వంటి దర్శకుల తర్వాతి మూవీస్‌పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్‌ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్‌. నాగచైతన్య హీరోగా పరశురామ్‌ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top