సుచిత్ర సంచలన వ్యాఖ్యలు | Singer Suchitra Accuses Dhansuh, Aishwarya Over Separation | Sakshi
Sakshi News home page

సుచీలీక్స్‌ సంచలనం.. పెళ్లి తర్వాత ధనుష్‌- ఐశ్వర్య .. ఆమె కంటే..

May 14 2024 3:59 PM | Updated on Sep 12 2024 11:03 AM

Singer Suchitra Accuses Dhansuh, Aishwarya Over Separation

ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్‌ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు

సుచీలీక్స్‌తో సింగర్‌ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి యావత్‌ సినీ ఇండస్ట్రీనే షేక్‌ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్‌ చేశారు. 

ఐశ్వర్య కంటే ధనుషే నయం
భర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్‌ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.

కార్తీక్‌ గే
భర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్‌, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.

అందుకే టార్గెట్‌
కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ మాజీ భర్త కార్తీక్‌.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్‌ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్‌, కార్తీక్‌ టార్గెట్‌ చేశారని వెల్లడించింది.

చదవండి: బాలీవుడ్‌లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్‌ సినిమా తెలుగులోనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement