
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 నామినేషన్స్ వచ్చాయి. వ్యక్తిగత కేటగిరిలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ అవార్డులకు 1248 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను అందజేయనుంది.