పెంపుడు జంతువులు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానమని, వాటి పరిరక్షణ చాలా అవసరమని నటి రష్మీ గౌతమ్ అన్నారు. మంగళవారం శ్రీనగర్కాలనీలో ‘ది ఎనిమల్ ప్లేస్’ పేరిట ఏర్పాటు చేసిన వెటర్నరీ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. పెంపుడు జంతువులు మానసిక ప్రశాంతత, సంతోషాన్ని అందిస్తాయన్నారు. పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక చికిత్సలు, సేవలను అందిస్తున్నామని డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ పేర్కొన్నారు.
-హైదరాబాద్


