బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ(La trobe University) ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను ప్రదానం చేసింది. మెల్బోర్న్లో ఆగస్టు 14న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి దీనిని అందజేశారు. అంతకముందు 2019లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడీమె ఈ డాక్టరేట్ అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖరాలిగా నిలిచింది.
రాణి మాట్లాడుతూ సినిమానే నా కలను నిజం చేసే మార్గం అయిందన్నారు. కాగా ఈమె నటించిన ‘బ్లాక్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ హిచ్చి’, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రాలు మహిళా సాధికారత, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించాయి.


