
కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దర్శకనిర్మాత రామ్గోపాల్ వర్మ.. ఆర్జీవీ యువర్ ఫిలిం కాంటెస్ట్ను ప్రవేశపెట్టాడు. ఈ పోటీకి వివిధ రాష్ట్రాల నుంచి వందలకొద్దీ ఎంట్రీలు వచ్చాయి. డైరెక్టర్ ఛాన్స్ కోసం 419 మంది అప్లై చేసుకోగా వాటిని జల్లెడ పట్టి 11 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారు తీసిన సన్నివేశాలను యూట్యూబ్లో షేర్ చేసిన వర్మ.. ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ గత నెలలో యూట్యూబ్లో పోల్ పెట్టాడు.
సోమవారం నాడు ఈ పోల్ ఫలితాలను వెల్లడించాడు. నిరంజన్ నాగరాజ, గురుప్రసాద్ మనారి, అభిజీత్ సాయి రెడ్డిలను ఫైనలిస్టులుగా ప్రకటించాడు. ఇప్పుడీ ముగ్గురిలో ఒకర్ని విజేతలుగా ప్రకటించాల్సిన బాధ్యత మీదేనంటూ మళ్లీ ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశాడు.
వారు తెరకెక్కించిన వీడియోలు చూసి ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ యూట్యూబ్లో మరో పోల్ పెట్టాడు. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వారితో వర్మ ఓ సినిమా తీస్తాడు. ఆరు నెలల్లోనే మూవీ తీసి రిలీజ్ చేస్తారు. మరి వీరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్గా గెలిచి సినిమా ఛాన్స్ అందుకుంటారో చూడాలి!
The 3 finalists chosen by the AUDIENCE POLLING for BEST DIRECTOR in the YOUR FILM competition are NIRANJAN NAGARAJA , GURU PRASAD MANARI and ABHIJEET SAI REDDY ..The POLLING for who is the BEST among these 3 is live now and will end on 10 th JULY https://t.co/qAfyyjRBMx…
— Ram Gopal Varma (@RGVzoomin) July 1, 2024
చదవండి: ఈఎమ్ఐ కట్టకపోవడంతో షారూఖ్ కారు తీసుకెళ్లారు: హీరోయిన్