
పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్.. కొన్నిరోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి మార్క్ కి గాయాలు కాగా కొన్నాళ్ల పాటు అక్కడే చికిత్స అందించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడిందనే అందరూ అనుకున్నారు. కానీ మరో ట్రీట్ మెంట్ కూడా జరుగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్)
పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటపెట్టారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అయితే తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నాడని, రాత్రుళ్ల నిద్రలో నుంచి భయపడి లేస్తున్నాడని చెప్పారు.
(ఇదీ చదవండి: నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో)
బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయినట్లు తన కొడుకు మార్క్ శంకర్ కి కలలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి రెండింటికి పనిచేస్తున్నారు. అవే హరిహర వీరమల్లు, ఓజీ. వీటిలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో దానిబట్టి రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..)