
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనంటూ బాంబు పేల్చారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని మాట్లాడారు. సైమా అవార్డుల ప్రెస్మీట్కు హజరైన అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందని తెలిపారు.
జాతీయ అవార్డులపై సైమా స్పందించి విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. మనకు ఎన్నీ జాతీయ అవార్డులు వచ్చినా టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రం స్పందించలేదన్నారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సిన గొప్ప వేడుక అని అల్లు అరవింద్ వెల్లడించారు.