ఆ నియమంతోనే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక

Priyanka Chopra Reveals The Rule Of Her Marriage With Nick Jonas - Sakshi

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయారు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను 2018లో  ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉండే ఈ స్టార్‌ కపుల్‌ పెళ్లికు ముందు ఓ ఒప్పందం పెట్టుకున్నారంట. ప్రతి మూడు వారాలకోసారి కలుసుకోవాలని పెళ్లి సమయంలో నియమం పెట్టుకున్నట్లు ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు ప్రియాంక మాట్లాడుతూ.. ‘మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకోవాలని నియమం పెట్టుకున్నాం. వృత్తి రీత్యా ఇద్దరం ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది. అందుకే పెళ్లి సమయంలో ఈ నియమం పెట్టుకున్నాం. లేదంటే ఒకరికొకరం సమయం కేటాయించుకోవాలనే ధ్యాసే ఉండకపోవచ్చు కదా’ అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి: అది నాకు చాలా గౌరవంగా ఉంది: నిక్‌ జోనస్‌)

కాగా, 2018లో డిసెంబర్‌ 2వ తేదీన ఈ గ్లోబల్‌ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ఇండియాలో జోధ్‌పూర్‌లోని ఉమైడ్‌ భవన్‌ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్‌, హాలీవుడ్‌ ప్రముఖుల మధ్య వీరి వివాహం రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో జరిగింది. అయితే ప్రియాంక నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది వైట్‌ టైగర్‌’ జనవరి 13న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం  ‘టెక్ట్స్‌ ఫర్‌ యూ’  సినిమా షూటింగ్‌ ఇటీవల లండన్‌ పూర్తి చేసుకున్నారు. జిమ్‌ స్ట్రౌస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. (చదవండి: ప్రియాంకకు ఏకంగా క్రికెట్‌ టీమే కావాలట!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top