Prabhas-Puneeth Rajkumar: పునీత్‌ను ఉద్దేశిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ప్రభాస్‌

Prabhas Shares Emotional Post On Puneeth Rajkumar Over James Movie - Sakshi

కన్నడ పవర్‌ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోంది. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్‌ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్‌ మూవీలోని పునీత్‌ పోస్టర్‌ను షేర్‌ చేశాడు ప్రభాస్‌.

చదవండి: అల్లు అర్జున్‌కు అలాంటి అవాంతరాలు, జ్యోతిష్యులు ఏం చెప్పారంటే..

ఈ పోస్ట్‌లో ప్రభాస్‌ ‘‘మ్జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ తాజాగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్‌ 29న గుండెపోటుతో మరణించిన విషయం విధితమే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top