‘గులాబీ’రచయిత కన్నమూత | Nadiminti Narasimha Rao Passed Away | Sakshi
Sakshi News home page

‘గులాబీ’రచయిత కన్నమూత

Aug 28 2024 11:40 AM | Updated on Aug 28 2024 1:43 PM

Nadiminti Narasimha Rao Passed Away

‘గులాబీ’, ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాలకు మాటల రచయితగా పని చేసిన నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో  కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ లోని  యశోదా ఆస్పత్రి లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి  వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో  తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సినిమాల్లోకి రాక ముందు  బొమ్మలాట అనే  నాటకం ద్వారా మంచి గుర్తింపుని పొందిన ఆయన ఒకప్పుడు  దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ  సీరియల్‌కి కూడా  రచయితగా  చేసారు. అలాగే ఈ టీవీ లో ఫేమస్ సీరియల్స్ గా గుర్తింపు పొందిన వండర్ బోయ్, లేడీ  డిటెక్టవ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కి  కూడా మాటలు అందించారు. నరసింగరావు మృతికి  పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement