సుప్రీంకోర్టులో 'లాపతా లేడీస్' చిత్ర ప్రదర్శన | Laapataa Ladies Movie Telecast In Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో 'లాపతా లేడీస్' చిత్ర ప్రదర్శన

Aug 9 2024 10:22 AM | Updated on Aug 9 2024 11:32 AM

Laapataa Ladies Movie Telecast In Supreme Court

భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. దీంతో కోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో బాలీవుడ్‌ చిత్రాన్ని నేడు ప్రదర్శించనున్నారు.  లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందించిన 'లాపతా లేడీస్' చిత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ సభ్యులు ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు  చూడనున్నారు. ఇలాంటి అవకాశం దక్కించుకన్న ఏకైక సినిమాగా లాపతా లేడీస్‌కు దక్కింది.

సుప్రీమ్‌ కోర్టు ఆవరణలో ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఈ స్క్రీనింగ్‌కు చిత్ర నిర్మాత, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో పాటు చిత్ర దర్శకులు కిరణ్ రావు కూడా హాజరుకానుంది. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా స్క్రీనింగ్ సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో జరగనుంది. సమాజంలో లింగ సమానత్వం అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి నొక్కిచెప్పడంలో భాగంగా ఈ స్క్రీనింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈ స్క్రీనింగ్ ఉంటుంది. రిజిస్ట్రీ అధికారులను కూడా సినిమాకు ఆహ్వానించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే 'లాపతా లేడీస్' చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ నటించారు. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు  గ్రామీణ ప్రాంతానికి చెందిన  వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శితమై సినీ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement