
కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.
అనేక టీవీ సీరియల్స్తో తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్ను వివాహం చేసుకుంది.
పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్ను షేర్ చేసింది.
పూజా బెనర్జీ బాలీవుడ్లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది. కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది.