20 రోజులకే ఓటీటీలోకి సూపర్‌ స్టార్‌ వారసుడి సినిమా! | Srinivasa Mangapuram Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

20 రోజులకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా!

Aug 19 2026 6:36 PM | Updated on Aug 19 2026 6:50 PM

Srinivasa Mangapuram Movie OTT Release Date Out

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌ బాబు సోదరుడు రమేశ్‌ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. జులై 30న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్ట్‌ 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సంస్థ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

‘శ్రీనివాస మంగాపురం’కథేంటంటే..
పెద్దిరెడ్డి(‘కిక్‌’శ్యామ్‌).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్‌(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్‌)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్‌మెంట్‌ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్‌. ఆమె రిజెక్ట్‌ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్‌ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్‌ వెంకటప్పయ్యనాయుడు(మోహన్‌ బాబు)తో శ్రీనివాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్‌ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై  చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement