breaking news
srinivasa mangapuram
-
Public Talk : మొదటి సినిమాతోనే 100 కోట్లు పక్కా... ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మహేష్ బాబుని దింపేశాడు
-
ఘట్టమనేని అభిమానులు కాలర్ ఎత్తుకునే సినిమా.. శ్రీనివాస మంగాపురం మూవీ పబ్లిక్ టాక్
-
‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘శ్రీనివాస మంగాపురం’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(జులై 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడంటే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే ‘శ్రీనివాసమంగాపురం’ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డారు. అజయ్ భూపతి బలమైన కథతోనే ఘట్టమనేని వారసుడిని పరిచయం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రొటీన్ కమర్షియల్ స్టోరీతో జై కృష్ణని లాంచ్ చేశాడు.వాస్తవానికి స్టార్ హీరోల వారసుల ఎంట్రీ దాదాపు ఇలాంటి కమర్షియల్ చిత్రాలతోనే ఉంటుంది. తొలి చిత్రంతోనే మాస్గా నిలబడే ప్రయత్నం చేస్తారు. జై కృష్ణ కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. వైవిధ్యమైన కథలనే ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘శ్రీనివాసమంగాపురం’ కథకు ఓకే చెప్పి జై కృష్ణ పెద్ద సాహసమే చేశాడు.ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా బలమైన కథను కాకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ హీరోకు కావాల్సిన లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ప్రేమ కథను కూడా గుండెలకు హత్తుకునేలా చూపించలేదు. ఓ యాక్షన్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి పాత్ర పరిచయం.. హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఇలా చకచకగా జరిగిపోతుంది. హీరో.. హీరోయిన్ని చూడగానే పాట.. ఒక్కసారి మాట్లాడగానే మరో పాట.. కాసేపటికి ఇంకో పాట..ఇలా మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు వచ్చి.. చిరాకు తెప్పిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొటీన్గానే సాగుతాయి.అయితే స్వతంత్ర బాబు పాత్ర ఎంట్రీ, ఆయన చేసే కామెడీ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తాయి. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు. హీరోయిన్ వెనుక హీరో పడడం.. ఆమె కూడా ఇతన్ని తెలిసిన వ్యక్తిలా చూడడం.. ప్లాష్బ్యాక్లో ఏదో ఉంటుందనే క్యూరియాసిటీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ఇది రొటీన్ లవ్స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతుంటాయి. క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తొలి సినిమానే అయినా జై కృష్ణ చక్కగా నటించాడు. లుక్స్ పరంగానూ తెరపై చూడడానికి బాగున్నాడు. యాక్షన్ సీన్స్తో పాటు డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం అనుభవలేమి కనిపించింది. రెండు, మూడు సినిమాలు పడితే.. నటుడిగా మరింత రాటుదేలుతాడు. మంగ పాత్రకి రాషా తడాని న్యాయం చేసింది.ఇక మోహన్ బాబు తెరపై కనిపించేది కాసేపే అయినా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కిక్ శ్యామ్, అజయ్, వాసుకితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో 'అల్లల్లే...' ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మా సినిమాను మహేశ్ బాబు మెచ్చుకున్నారు: అజయ్ భూపతి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మంచు మోహన్బాబు విలన్ పాత్ర పోషించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అజయ్ భూపతి మాట్లాడుతూ.. 'సూపర్ స్టార్ కృష్ణగారి కుటుంబం నుంచి ఒక హీరోని పరిచయం చేయడం అంటే కచ్చితంగా బాధ్యత, ఒత్తిడి ఉంటుంది. అయితే నేను మొదట్లో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నిజానికి నేనెప్పుడూ నా శైలిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. ఆ సినిమాలకు సంబంధించిన వాళ్లు కూడా నా స్టైల్కే వదిలేశారు. కాకపోతే ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ కోసం జై కృష్ణతో నా ప్రయాణం మొదలైన తర్వాత తను నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చాడు. కృష్ణగారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకున్నానని' దర్శకుడు తెలిపారు.ఇంకా మాట్లాడుతూ..'నిర్మాత కిరణ్గారికి నేను ఓ సినిమా చేయాలి. శ్రీనివాస మంగాపురం సినిమా అనుకున్నప్పుడు అశ్వినీదత్గారిని కలిశాను. ఆ తర్వాత జై కృష్ణను రెండు, మూడు సార్లు కలిశాను. తనపై నమ్మకం వచ్చిన తర్వాత ఈ మూవీ ఆరంభించాం. ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్తోనే కథ రాసుకున్నాను. ఈ కథ బ్యాక్డ్రాప్, క్యారెక్టర్ల పేర్లు, వాళ్ల లవ్ స్టోరీ... వీటన్నింటికీ ఈ టైటిల్ సరిపోతుంది. ఇది ఫిక్షన్ కథ అయినప్పటికీ నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగానూ కొన్ని సన్నివేశాలు రాశాను. ఈ సినిమా మొదలైన తర్వాత ప్రేక్షకులు కథతో, రాత్రులతో లీనమైపోతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇది కంప్లీట్ ఎమోషనల్ లవ్స్టోరీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారిని ఇంత ఎమోషనల్ పాత్రలో ఆడియన్స్ చూసి ఉండరు. జై కృష్ణ, మోహన్బాబుగారు, రాషా మధ్య వచ్చే సన్నివేశాలు హత్తుకుంటాయి. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి' అని అన్నారు.మహేశ్ బాబు మా సినిమా చూసి అదిరిపోయింది... జై కృష్ణ, రాషా తడానీ జోడీ బాగుందన్నారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి అని మెసేజ్ పెట్టారు. ప్రభాస్గారు కూడా మా సినిమాని ప్రోత్సహించడం హ్యాపీగా అనిపించింది. దాదాపుగా నా కథలను సమాజం నుంచే తీసుకుంటాను. నా ఫిల్మోగ్రఫీలో శ్రీనివాస మంగాపురం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా ‘మంగళవారం 2’ త్వరలోనే మొదలవుతుందని దర్శకుడు వెల్లడించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఘట్టమనేని జయకృష్ణ (ఫొటోలు)
-
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా HD స్టిల్స్
-
జయకృష్ణ శ్రీనివాస మంగాపురం.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఉక్కిరి బిక్కిరి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. హరి చరణ్ ఆలపించారు. ఈ సాంగ్ జీవీ ప్రకాశ్కుమార్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. -
'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఆ రోజే నా సినిమా కూడా రిలీజైంది: మహేశ్ బాబు స్పెషల్ వీడియో
సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేష్బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ మూవీపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు. మా రమేశన్న వాళ్ల అబ్బాయి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది మా కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇప్పటి వరకు చూసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చాలా చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఈ క్రెడిట్ అంతా అజయ్ భూపతికి దక్కుతుందన్నారు. ఈ సినిమా జూలై 30న రిలీజ్ కానుంది.. అదే రోజు నా సినిమా రాజ కుమారుడు కూడా విడుదలైందని వెల్లడించారు. ఈ మూవీతో మీరంతా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మహేశ్ బాబు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026 -
నేనే NEXT మహేష్!.. మూవీస్ లోకి వస్తానంటే బాబాయ్ చెప్పిన మాట..
-
నాపై ఒత్తిడి ఉండటం మంచిదే!: జై కృష్ణ
‘‘నేను ఫ్యాన్స్కి ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేనీ సినిమా చేస్తున్నానని తెలియక ముందు నుంచే ఘట్టమనేని అభిమానులు నన్ను స పోర్ట్ చేశారు. అందుకే నటుడిగా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి... నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదట్నుంచే ఉంది. ఈ విషయంలో నాపై ఒత్తిడి ఉండటం మంచిదే.అది నన్ను మంచి కథల వైపు తీసుకువెళ్తుంది’’ అని జై కృష్ణ అన్నారు. సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేష్బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో జై కృష్ణ చెప్పిన సంగతులు... ⇒ నా 16 ఏళ్ల వయసులో యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. రెండేళ్లు ముంబై, తర్వాత పాండిచ్చేరి, నెక్ట్స్ న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఇండియా వచ్చి కథలు వినడం ప్రారంభించాను. కొన్ని కథలు విన్న తర్వాత, నిర్మాత పి. కిరణ్గారి ద్వారా దర్శకుడు అజయ్ భూపతిగారిని కలిశాను. అజయ్గారు చెప్పి కథ నచ్చడంతో, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చేశాను. మంచి క్యారెక్టరైజేషన్, మంచి ఎమోషన్తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. నేను అనుకున్న అంశాలు ఈ కథలో కుదిరాయి. ఈ చిత్రం కోసం అజయ్గారు 3 నెలలు వర్క్షాప్ చేయించారు. లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్... ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యాం. ⇒ ఇందులో నేను శ్రీను అనే రోల్ చేశాను. శ్రీనుకి కాస్త అల్లరితనం ఉంటుంది. కానీ తనకేం కావాలో తనకి స్పష్టంగా తెలుసు. తను మంగను (రాషా తడానీ) ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుంది? అన్నదే మిగిలిన సినిమా కథాంశం. ఇది రెగ్యులర్ లవ్స్టోరీ సినిమా కాదు. ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ట్విస్ట్లు కొత్తగా ఉంటాయి. అజయ్గారు క్లారిటీ ఉన్న దర్శకుడు. అశ్వినీదత్గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ (మహేశ్బాబు) తొలి సినిమా కూడా ఈ బ్యానర్లోనే రూపొందింది.⇒ నాకు ఫ్యామిలీ స పోర్ట్ ఉంది. నా ప్రతి అడుగులో బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు) ్ర పోత్సాహం ఉంది. నేను సినిమాల్లోకి రావాలని, మంచి నటుడిగా ఎదగాలని మా తాతయ్య (కృష్ణ)గారు కోరుకున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. నేను యాక్టర్ కావాలనుకున్న తర్వాత బాబాయ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. దర్శకుడు విజన్కు తగ్గట్లు యాక్ట్ చేయాలని చె΄్పారు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ చూసి, హ్యాపీ ఫీలయ్యారు. ఈ సినిమా ఆయనకు నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్లు, సాంగ్స్ చాలా నచ్చాయని చె΄్పారు. స్క్రీన్పై డిఫరెంట్గా కనిపిస్తున్నావని, క్యారెక్టర్లోకి పూర్తిగా వెళ్లి పోయావని చె΄్పారు. ⇒ నా చిన్నతనంలో నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్కు వెళ్లాను. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ‘అర్జున్’ షూటింగ్కు వెళ్లాను. ఈ చిత్రానికి మా నాన్నగారు నిర్మాత. ‘గుంటూరు కారం’ షూటింగ్కు వెళ్లాను. ఒక యాక్టర్గా నాకు విభిన్న జానర్స్లో సినిమాలు చేయాలని ఉంది. కానీ యాక్షన్ సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం. నేను యాక్టర్ని కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. -
శ్రీనివాస మంగాపురం హీరో బర్త్ డే.. హీరోయిన్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మూవీ టీమ్. తాజాగా ఈ చిత్రంలోని ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలోని రావే చెలియా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
నాకు ఫొటో గ్రఫీ అంటే ఇష్టం
‘తూ చీజ్ బడీ హై మస్త్...’ అంటూ ఒకప్పుడు రవీనా టాండన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘ఉయి అమ్మ...’ అంటూ ఆమె తనయురాలు రాషా తడానీ కుర్రకారు హార్ట్ బీట్ను పెంచింది. తొలి చిత్రం ‘ఆజాద్’తోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న రాషా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఈ యంగ్ హీరోయిన్ గురించి కొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలోని హీరోయిన్ పాత్ర (మంగ) కోసం దర్శక– నిర్మాతలు నాకు అవకాశం కల్పించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. జేకే (జయకృష్ణ ఘట్టమనేని) నా బెస్ట్ కో స్టార్. మోహన్ బాబు, వాసుగార్లు ఇలా టీమ్ అందరూ నాకు హెల్ప్ చేశారు. నాకు తెలుగు భాష పూర్తిగా రాదు. కొంచెం కొంచెం వచ్చు. అయితే తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మహేశ్బాబుగారికి అభిమానిని. అలాగే కృష్ణగారికి కూడా. తెలుగు ప్రేక్షకులు నా నటనను మెచ్చుకునేలా యాక్ట్ చేస్తాననే అనుకుంటున్నాను.ఉయి అమ్మ... అని గట్టిగా అరిచాడు‘ఆజాద్’ సినిమాలోని ‘ఉయి అమ్మ’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ఒకసారి బిల్బోర్డ్పై ఉన్న నా సినిమా పోస్టర్ను నేను ఫోటో తీసేందుకు నా కారును ఆపి, కారు అద్దాన్ని కిందకి దించాను. అప్పుడు అక్కడే వీధిలో ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి... ‘అరే... ఈమె ఉయి అమ్మ’ అని గట్టిగా అరిచాడు. ఈ పాట నన్ను అంతలా ప్రేక్షకులకు చేరువ చేసింది.నాన్న చాలా సపోర్ట్ చేస్తారుమా నాన్న (డిస్ట్రిబ్యూటర్– నటుడు అనిల్ తడానీ) నన్ను చాలా సపోర్ట్ చేస్తుంటారు. నేను ఆర్టిస్ట్గా చేయాలనుకున్నప్పటికీ నాన్న చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది. నా ఇంట్రస్ట్ని అర్థం చేసుకుని, నాన్న వ్యాపార మెలకువలు చెబుతుంటారు. అయితే మా అమ్మలానే నాన్న కూడా నా నిర్ణయాలను నన్నే తీసుకోమంటారు. మా అమ్మే స్ఫూర్తిమా అమ్మ నటిగా పరిచయం అయినప్పుడు నాకంటే రెండేళ్లు చిన్నది. ఇప్పుడు నా వయసు 21. అంటే... అమ్మ స్క్రీన్కి పరిచయం అయినప్పుడు తనకు 19. ఇప్పుడున్నంత సౌకర్యాలు అప్పట్లో ఉండేవి కావని తను చెబుతుంటుంది. అది నిజమే. అప్పట్లో నటీమణులతో పోల్చితే ఇప్పుడు మాకు ‘వ్యానిటీ వాన్’ సౌకర్యం ఉంది. కష్టం విషయంలోనూ అప్పటివాళ్లతో పోల్చితే మాకు తక్కువే. మా అమ్మ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో కష్టపడింది. ఒక నటిగా ఆమె ప్రయాణం నాకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఆమె నాకు స్ఫూర్తి. ’అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో మా అమ్మ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నటించి, నేను చూసిన తొలి సినిమా కూడా ఇదే.అద్దం ముందు నటనమా అమ్మను కెమెరా ముందు చూడటం మొదలుపెట్టినప్పటి నుంచే నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. నాకు క్రియేటివ్ జాబ్ అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉండేది. అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటూ నాట్యం చేయడం, పాటలు పాడటం చేసేదాన్ని. పాడటం, పియానో ??వాయించడం చేస్తున్నట్లుగా నటించేదాన్ని. నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పటికీ ఒకానొక దశలో నేను వెట్ (పశు వైద్యురాలు) కావాలని కూడా అనుకున్నాను. నాకు ఫొటోగ్రఫీ ఇష్టం. యానిమల్స్ ఫొటోలు తీయడం చాలా ఇష్టం. -
'శ్రీనివాస మంగాపురం' మూవీ HD స్టిల్స్
-
'బళ్లారి ఎప్పటికీ వెంకటప్పయ్య నాయుడిదే'.. ఆసక్తిగా ట్రైలర్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో మోహన్ బాబు యాక్షన్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకథతో పాటు మాస్ యాక్షన్ ఉన్న ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలో నరేశ్, బ్రహ్మజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
కారం దోసెలు ఫుల్లుగా లాగించాను: రాషా తడానీ
‘తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు నచ్చిన చిత్రం. తెలుగు సినిమా చాలా అడ్వాన్డ్స్గా ఉంది. అందుకే తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆ చాన్స్ ‘శ్రీనివాస మంగాపురం’తో లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే నా తొలి తెలుగు సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రీకరణ తిరుపతిలో జరగడం నా అదృష్టం. దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాషా తడానీ. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీదత్ సమర్పణలో అజయ్ భూపతి దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో రాషా తడానీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగ పాత్రలో నేను నటించాం. మంగ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అజయ్ భూపతిగారు ప్రతి డైలాగ్, అందులోని ఎమోషన్ను దగ్గరుండి నేర్పించారు. అశ్వినీదత్గారు నన్ను మనవరాలిలా చూసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఒక విహార యాత్రలా గడిచింది. నేనైతే కారం దోసెలు ఫుల్లుగా లాగించాను. అలాగే సీరియస్గా వర్క్ చేయాలన్నప్పుడు సీరియస్గానే చేశాం. మా అమ్మానాన్నలకు కూడా తెలుగు సినిమా అంటే అభిమానమే. మా నాన్నగారు (డిస్ట్రిబ్యూటర్–నిర్మాత అనిల్ తడానీ) ఓ సందర్భంలో ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం తెలుగు భాష అర్థం అవుతోంది. పూర్తిగా నేర్చుకోమని మా అమ్మ సలహా ఇచ్చారు. నేనూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. నా తొలి హిందీ చిత్రం ‘ఆజాద్’ పీరియాడికల్ మూవీ. ఆ తర్వాత చేసిన ‘లైకీ లైకా’ డిఫరెంట్ లవ్ ఫిల్మ్. ‘శ్రీనివాస మంగాపురం’ విలేజ్ లవ్స్టోరీ. హిందీలో కామెడీ సినిమా చేస్తున్నాను. ఇలా విభిన్న జానర్స్లో సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
మహేశ్ బాబాయ్ ఆ మాట చెప్పాడు.. ప్లాన్ ‘బి’ లేదు : జయకృష్ణ
‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’... ‘పోకిరి’లో మహేశ్బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. మహేశ్బాబు అన్నయ్య రమేష్బాబు తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని కూడా ఇదే తరహాలోనే అన్నారు. ‘‘ఒక్కసారి ఫిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసేయాల్సిందే’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ జయకృష్ణ పేర్కొన్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా జూలై 9న హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు జయకృష్ణ. ‘‘యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అవ్వడం మాత్రమే కాదు... కెరీర్ కోసం ఎంత కష్టపడటానికైనా రెడీ’’ అంటూ... ఇంకా ‘సాక్షి’తో జయకృష్ణ ప్రత్యేకంగా చెప్పిన విశేషాలు...చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాణ్ణి: చిన్నప్పుడు నేను చబ్బీగా ఉండేవాణ్ణి. దాంతో ‘సెల్ఫ్ కాన్ఫిడెన్స్’ ఉండేది కాదు. కానీ యాక్టర్ కావాలన్నది నా టార్గెట్. మా తాతయ్య చాలా ఎంకరేజ్ చేశారు. ‘నువ్వు యాక్ట్ చేయగలవు’ అన్నారు. ఆ మాటలు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. దగ్గర దగ్గర 120 కిలోల బరువు ఉండేవాణ్ణి. దాదాపు నలభై కేజీలు తగ్గాను. న్యూయార్క్, ముంబై వెళ్లి యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక కంప్లీట్ యాక్టర్కి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకున్నాను.ఫుడ్ లవర్ని: ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో అంత లావుగా ఉండేవాణ్ణి. యాక్టర్ అన్నాక అలా కుదరదు... చాలెంజ్గా తీసుకుని బాగా తగ్గాను. ఫుడ్ తినడం కూడా తగ్గించాను. ఇక్కడ నేను వెయిట్ ‘లాస్’ అయితే అక్కడ స్క్రీన్ మీద నాకు ‘గెయిన్’. అలా కెరీర్ కోసం ఏ త్యాగం అయినా చేసేస్తాను. ప్లాన్ బి లేదు:కెరీర్ వైజ్గా ప్లాన్ ఎ, ప్లాన్ బి అని పెట్టుకోలేదు. యాక్టర్ అవ్వాలన్నది నా ప్లాన్ ఎ’. ఆ ఒక్కదానికే ఫిక్స్ అయ్యాను. అదే ప్లాన్ బి’ పెట్టుకున్నామనుకోండి అప్పుడు నా ప్లాన్ ఎ’ మీద నాకు నమ్మకం లేనట్లే. అలాగే నేనెప్పుడూ ‘హీరో’ అవ్వాలనుకోలేదు. ‘యాక్టర్’ అనేది నా టార్గెట్. అందుకే కథ, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేస్తాను. ‘శ్రీనివాస మంగాపురం’ కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాను.సినిమా ముందు నాకేదైనా తక్కువే: ‘గోల్డెన్ స్పూన్ కదా... ఏం కష్టపడతాడులే’ అని చాలామంది అనుకోవచ్చు. కానీ సినిమా ముందు నాకేదైనా తక్కువే. ‘శ్రీనివాస మంగాపురం’ కోసం 93 రోజులు వర్క్ చేశాం. కొన్ని సీన్స్ చేశాక ఇంటికెళ్లి, షవర్ ముందు నిలబడితే ఒంటి మీద పడిన నీళ్ల నుంచి బాగా మట్టి వచ్చేది. అలాంటి లొకేషన్స్లోనూ షూటింగ్ చేశాం. షూట్ నుంచి ఇంటికెళ్లాక ‘ఇవాళ నా పనిని వంద శాతం చేశాను’ అని ప్రశాంతంగా నిద్రపోవాలన్నది నా లక్ష్యం. 93 రోజులూ అలానే నిద్రపోయాను. డైరెక్టర్ అజయ్ భూపతిగారి స్క్రిప్ట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో తెలిసిందే. లవ్స్టోరీయే కదా... చాలెంజెస్ ఉండవని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈ సినిమా స్టోరీలో చాలా సవాళ్లు ఉన్నాయి.ఫిఫ్టీ ఫిఫ్టీ చేయకూడదని బాబాయ్ అన్నారు: నేను సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు మా మహేశ్ బాబాయ్ ‘ఏం చేసినా ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు... హండ్రెడ్ పర్సెంట్ చేయాలి’ అన్నారు. మా సినిమా అప్డేట్స్ తెలుసుకుంటూ, ఎంకరేజ్ చేశారు. గౌతమ్ (మహేశ్ కుమారుడు) కూడా సినిమాల్లోకి వస్తాడు. మీకు పోటీ ఉంటుందా? అంటే... అలా ఏం ఉండదు. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్దది. ఎవరైనా రావొచ్చు... నిరూపించుకోవచ్చు. బాధను పంచుకోను:ఎవరి లెవల్ కష్టాలు వాళ్లకు ఉంటాయి. నాకూ చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డల్ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఎవరితోనూ షేర్ చేసుకోను. అలాగని టెన్షన్ పడిపోను. ప్రతి విషయానికీ ఒక పరిష్కారం ఉంటుందని నమ్ముతాను. మనిషికన్నా పెద్దది ఇంకేదో ఉంటుందని నమ్ముతాను. కొన్ని డెస్టినీకి వదిలేయాలి. మూడు రోజులకోసారి ఫోన్ చార్జ్ చేస్తాను: నాకు అబ్జర్వేషన్ ఎక్కువ. ట్రావెల్ చేస్తుంటాను. అక్కడి మనుషుల మాట తీరు, వాళ్ల నడవడిక తెలుసుకుంటాను. నేచర్ నుంచి నేర్చుకోవడం ఇష్టం. అందుకే ఫోన్ పెద్దగా వాడను. నా ఫోన్ని మూడు రోజులకోసారి చార్జ్ చేస్తుంటాను. గాడ్జెట్స్ అంటే ఇష్టమే. కానీ నేచర్ ద్వారా నేర్చుకున్నది నేచురల్గా ఉంటుంది.మా అమ్మ పెంపకం చాలా ట్రెడిషనల్: మా అమ్మ ప్రాపర్ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఏదైనా నేర్చుకోకపోతే ‘తర్వాత చూద్దాంలే’ అనుకోరు. మేం నేర్చుకోవాల్సిందే. అలాగే తెలుగు బాగా మాట్లాడాల్సిందే అని పట్టుబట్టేవారు. అందుకే నాకు తెలుగు బాగా వచ్చింది. నా క్యారెక్టర్కి డబ్బింగ్ బాగా చెప్పగలిగాను. ఇంట్లో పండగలు బాగా చేస్తాం. సంవత్సరానికి ఒకసారైనా నేను తిరుపతి వెళ్లాల్సిందే. వినాయకుడు అంటే కూడా ఇష్టం. నో క్రష్:అమ్మాయిలతో మాట్లాడటం అంటే నాకు చాలా బిడియం. ఇప్పుడు ఈ సినిమా చేయడం మొదలుపెట్టాక కొంచెం మొహమాటం పోయింది. అందరితో మాట్లాడగలుగుతున్నాను. సో... అమ్మాయిలతో మాట్లాడలేని అబ్బాయికి ఇక ‘క్రష్’ ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). యాక్టర్గా మాత్రమే కాదు...: సినిమాలో నటించడం వరకే అని ఫిక్స్ కాలేదు. డైరెక్షన్ అంటే ఇంట్రస్ట్ ఉంది. నాకు రైటింగ్ అంటే ఇష్టం. ఎప్పుడైనా నేను స్టోరీ రాశాననుకోండి... ఆ స్టోరీలోని ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతాను కాబట్టి నేనే హీరోగా చేస్తాను. నా నెక్ట్స్ సినిమాలకు కథలు విన్నాను. త్వరలోనే ఫైనలైజ్ అవుతాయి.మా నాన్న మంచి యాక్టర్ మా నాన్న మంచి యాక్టర్. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్ అన్నీ బాగా చేశారు. అప్పుడప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటాను. ముఖ్యంగా ‘బజారు రౌడీ’ నాకు చాలా ఇష్టం. నా సినిమా చూడ్డానికి నాన్న లేరనే బాధ చాలా ఉంది. అలాగే షూటింగ్ చేసేటప్పుడు ‘తాతయ్య, నాన్న ఉండి ఉంటే బాగుండేది’ అని చాలా సార్లు అనిపించింది. తాతగారిలా ప్రయోగాలు చేసే స్కోప్ వస్తే మంచిదే. ఒకప్పుడు తాతగారు వన్ ఇయర్కి 15 సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ. నాకైతే రెండు మూడు సినిమాలు చేయాలనుంది.ఆ ఒత్తిడి లేదుమాకు ఉన్న అడ్వాంటేజ్ ఫ్యాన్ బేస్. మా తాతగారు మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మా ఫ్యాన్స్. ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు... అప్పుడే ఫ్యాన్స్ అభిమానం ఎలా ఉంటుందో తెలిసింది. ఈ క్రెడిట్ మొత్తం మా ఫ్యామిలీకే. తాత నుంచి మాకు ఫార్వార్డ్ అయింది. తాతయ్యతో, బాబాయ్తో పోల్చుకుంటారేమో అనే ఒత్తిడి లేదు. ఆ కుటుంబం గర్వపడేలానే నటిస్తాను... పర్సనల్ బిహేవియర్ కూడా అంతే.– డి.జి. భవాని -
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
-
మాస్ ఎంట్రీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్బాబు (హీరో మహేశ్బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు.చలసాని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూలై 9న విడుదల కానుంది. ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరోగా జయకృష్ణ నిలుస్తున్నారు. కృష్ణ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో, ప్రోడక్షన్ విభాగంలో శిక్షణ పొందారు జయకృష్ణ. అదే విధంగా అమెరికా వెళ్లి నటనతో పాటు హీరోకి అవసరమైన అన్నిటిలో పక్కా ట్రైనింగ్ తీసుకున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సిల్వర్ స్క్రీన్పై జయకృష్ణ మంచి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని స్పష్టం చేసింది. అలాగే టీజర్ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన జయకృష్ణ లుక్స్, టీజర్లోని డైలాగులు, నటన చూస్తుంటే ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్బాబులా కనబడుతున్నాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. తప్పనిసరిగా కృష్ణ, మహేశ్బాబుల వారసత్వాన్ని నిలబెట్టే హీరో అవుతాడని, ‘శ్రీనివాస మంగాపురం’తో గ్యారెంటీగా సక్సెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను'.. శ్రీనివాస మంగాపురం యాక్షన్ గ్లింప్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
మహేష్ బాబాయ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు. శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది. తాతయ్య ఆశీస్సులు నాతో ఉంటాయి‘‘తాతయ్య కృష్ణగారు నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందర్నీ కలవడం హ్యాపీగా ఉంది. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు). అలాగే మా బాబాయ్ మహేశ్బాబుకి నేను డైహార్డ్ ఫ్యాన్ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ను లాంచ్ చేసి, ఫీడ్బ్యాక్ ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న మా బాబాయ్కి థ్యాంక్స్. ఈ సందర్భంగా మా నాన్న రమేశ్బాబుగారిని తలచుకుంటున్నాను. మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేశ్బాబుగారితో ‘రాజకుమారుడు’ చేశారు దత్తుగారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ఆయనకు రుణపడి ఉంటాను.కిరణ్, అజయ్ భూపతి, రాషా, రాఘవేంద్ర రావు, జయకృష్ణ, అశ్వినీదత్, ఆదిశేషగిరి రావు ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ‘‘ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు రాషా. ‘‘కృష్ణగారు నిజమైన సూపర్స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణగారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. జయకృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ‘‘కృష్ణగారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘‘జయకృష్ణ న్యూయార్క్లో ఫిల్మ్ కోర్సు చదివాడు. ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు ఆదిశేషగిరి రావు. ‘‘శ్రీనివాస మంగాపురం’ అని పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్ర రావు. -
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)
-
'శ్రీనివాస మంగాపురం' ఫస్ట్ సాంగ్ విడుదల.. జీవీ ప్రకాశ్ అదుర్స్
ఘట్టమనేని జయకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి మొదటి సాంగ్ తాజాగా విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్బాబు తనయుడే జయకృష్ణ.. ఇందులో ఆయనకు జోడీగా నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా 'అల్లెల్లే..' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ సాంగ్ను జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తూనే ఆలపించారు. కొరియోగ్రఫీ ఆట సందీప్ అందించారు. -
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్
-
తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు!
‘ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకు ఏమనిపిస్తోంది’ అంటూ జయకృష్ణ చెప్పే డైలాగ్తో ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ టీజర్ ఆరంభమైంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్బాబు తనయుడు జయకృష్ణ, నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని జోడీగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని హీరో మహేశ్బాబు లాంచ్ చేశారు. ‘నేను అసలు నీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నానా?, మంగ లేక΄ోతే ఈ వాసుగాడు తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు’ అంటూ జయకృష్ణ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ‘‘తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: జయకృష్ణ. -
మహేశ్ బాబు సోదరుడి కుమారుడు ఎంట్రీ.. టీజర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీని చందమామ కథలు బ్యానర్పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్లో డైలాగ్స్, ఫైట్ సీన్స్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో కథ ఉండనున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Srinu - Manga and their eternal love tale ❤️🔥#SrinivasaMangapuram Teaser out now 🔥-- https://t.co/OvECTgsBpT In cinemas this 2026 💥#JayaKrishnaGhattamaneni @themohanbabu #RashaThadani @DirAjayBhupathi @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl… pic.twitter.com/tLoPCLy7W8— Telugu Film Journalists Association (@FilmJournalists) April 15, 2026 -
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. Your smile is simple, but the magic is unforgettable ❤️🔥Happiest Birthday #RashaThadani 💐❤️🤩#SrinivasaMangapuram #JayaKrishnaGhattamaneni @themohanbabu @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/yrDAkbA3Ye— Ajay Bhupathi (@DirAjayBhupathi) March 16, 2026 -
ఘట్టమనేని జయకృష్ణ సినిమాలో మోహన్ బాబు.. లుక్ అదిరింది!
‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా-ధోతీ ధరించి పవర్ ఫుల్గా, గంభీరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మోహన్ బాబు నటించినట్లు తెలుస్తుంది. చాలాకాలం తర్వాత మోహన్ బాబు మళ్లీ ఇలాంటి పాత్రలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోనూ మోహన్ బాబు విలన్గా నటిస్తున్నాడు. Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️🔥Brace yourselves for his towering performance in a role carved with power and pride💥An @DirAjayBhupathi Film 🔥 pic.twitter.com/JvGBr9JGg4— Chandamama Kathalu Pictures (@CKPicturesoffl) February 28, 2026 -
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు వెండితెరకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ టాలీవుడ్లో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్బాబు తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీలో రాషా హీరోయిన్గా నటిస్తోంది. ఫస్ట్ లుక్శుక్రవారం (జనవరి 30న) ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో రాషా కుర్తీలో క్యూట్గా కనిపిస్తోంది. తన పాత్ర పేరును మంగ అని ప్రకటించారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.హిందీలో..వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీకే ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే హీరో జయకృష్ణకు ఇదే తొలి సినిమా కాగా రాషా తడానీ మాత్రం హిందీలో ఆజాద్ సినిమాలో నటించింది. ఇందులో ఉయ్ అమ్మా.. అనే పాటలో అద్భుతంగా స్టెప్పులేసి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. Marking a beautiful beginning ✨ Presenting #RashaThadani as ‘MANGA’ to Telugu Cinema from #SrinivasaMangapuram ❤️🔥Get ready to witness her enchanting performance on the big screens soon 🫶An @DirAjayBhupathi FilmA @gvprakash Musical#JayaKrishnaGhattamaneni @AshwiniDuttCh… pic.twitter.com/zYdxmCCsfM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 30, 2026 -
హీరోగా అన్న కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)మహేశ్ కుటుంబం నుంచి త్వరలో చాలామంది వారసులు.. ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్లలో తొలుత జయకృష్ణ లాంచ్ కాబోతున్నాడు. ఇతడు మహేశ్ అన్న రమేశ్ బాబు కొడుకు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. రషా తడానీ హీరోయిన్. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలు కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బులెట్పై గన్ పట్టుకుని ఉన్న లుక్ బాగుంది.ఇందులోనే మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్ కొన్నిరోజుల క్రితం వచ్చింది గానీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి వస్తే ఆయన ఉన్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతారు. జయకృష్ణ కాకుండా మహేశ్ కొడుకు గౌతమ్, కూతురు సితార. అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026 -
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుచానూరు/చంద్రగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తదితరులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఆయనకు వైవీ సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం అందజేసి వేదాశీర్వాదం చేశారు. సీజేఐకి చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొని గోవు, దూడకు గ్రాసం తినిపించారు. -
ఉగాదికి ముందే పంచాంగం
సాక్షి, తిరుమల: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువుదీరిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11, 25 తేదీల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 12, 26వ తేదీల్లో 5 సంవత్సరాల్లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పిస్తాని పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేవా టిక్కెట్లు పొందాలని సూచించారు. టీటీడీ వెబ్సైట్లో టికెట్లు లేనట్లయితే ఇతర సైట్లలో ఉన్న టికెట్లు నకిలీవిగా భావించాలని తెలిపారు హెచ్చరించారు. ఇక నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాగా తెలుగు పండుగ ఉగాదిని పురస్కరించుకుని మార్చి మొదటి వారంలోనే భక్తులకు పంచాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. -
నేడు స్వామివారి గరుడోత్సవం
-
మోహిని అవతారంలో ఊరేగిన శ్రీవారు
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ కోసం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్రగా బయలుదేరి వెంకన్నకు లక్ష్మీహారం సమర్పించనున్నారు. కాగా, భక్తుల గోవింద నామ స్మరణ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
కల్యాణ వెంకన్నకు బంగారు ఆభరణాలు
-
కల్యాణ వెంకన్నకు బంగారు ఆభరణాలు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి గురువారం సుమారు కిలోన్నరకు పైగా బరువున్న (రూ. 42 లక్షల విలువ) బంగారు ఆభరణాలు కానుకగా అందాయి. హైదరాబాద్కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీఎస్ రాజు, సుగుణ దంపతులు గురువారం స్వామివారికి బంగారు కఠి, వరద హస్తాల ఆభరణాలను టీటీడీ జేఈవో శ్రీనివాస్రాజు అందజేశారు. -
చెట్టును ఢీ కొన్న ఆటో: ఒకరు మృతి
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం వద్ద ఆదివారం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 9 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రలను మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో పోలీసులు వారిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగంతో ఆటోను నడపడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.


