ఆవారా సీక్వెల్‌.. తెరపైకి కార్తీ పేరు | Karthi and Tamannaah Telugu Interesting Passionate Movie Scene | Sakshi
Sakshi News home page

ఆవారా సీక్వెల్‌.. తెరపైకి కార్తీ పేరు!

Jun 6 2023 4:18 AM | Updated on Jun 6 2023 8:57 AM

Karthi and Tamannaah Telugu Interesting Passionate Movie Scene - Sakshi

మళ్లీ ఆవారాగా కనిపించనున్నారట కార్తీ. లింగుసామి దర్శకత్వంలో కార్తీ, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన తమిళ చిత్రం ‘పయ్యా’ (తెలుగులో ‘ఆవారా’). 2010లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది.

ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని కొంత కాలంగా లింగుసామి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండో భాగంలో ఆర్య హీరోగా చేస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ కార్తీ పేరే తెరపైకి వచ్చింది. కార్తీ నటించే చాన్స్‌ ఎక్కువగా ఉందని కోలీవుడ్‌ అంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement