బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "ఈరోజు మా చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' నుంచి రిలీజ్ ప్రోమో ను విడుదల చేసాం. రిలీజ్ ప్రోమో అదిరిపోయింది, చూసిన వాళ్లంతా ప్రోమో అద్భుతంగా ఉంది అని కొనియాడారు.
ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రం అక్టోబర్ 31న భారీగా విడుదల అవుతుంది" అని తెలిపారు.


