తమిళ హీరో అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇదయం మురళి’. థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించడంతో వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్స్ ఎంతన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరి ఎంత తీసుకున్నారంటే..
ధర్వ మురళి: ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్.
ప్రీతి ముకుందన్: ఈ సినిమాకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుందట.
కయాదు లోహర్: ఈ బ్యూటీ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
నిహారిక ఎన్ఎం: ఆమెకు ఈ సినిమాకు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.
నట్టి నటరాజ్: ఈ సినిమాకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం.
తమన్: ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్. ఈయన యాక్టర్గానూ ఈ సినిమాలో కనిపించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మాళవిక మోహనన్: ఆమె సుమారు రూ.3 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం.
ఫహాద్ ఫాజిల్: సాధారణంగా ఒక్కో సినిమాకు ఫహాద్ రూ.7 కోట్ల వరకు తీసుకుంటారట.
మొత్తంగా ‘ఇదయం మురళి’లో అధర్వ మురళితో పాటు ఫహాద్ ఫాజిల్, మాళవిక మోహనన్, కయాదు లోహర్, తమన్ వంటి పలువురు ప్రముఖులు కనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.


