
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అనుభూతికి లోనవుతారు. 'హిట్ 3' దర్శకుడు శైలేష్ కొలను కూడా ఇప్పుడు అలాంటి అనుభూతికి లోనయ్యాడు. ఈసారి దర్శనం మాత్రం జీవితంలో మర్చిపోలేనని, అదొక అనిర్వచనీయమైనది అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం)
'నా జీవితంలోనే ఈ రోజు (మే 08) స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. థ్యాంక్స్ టూ అభయ్(కొడుకు). నిన్న రాత్రి స్వాతి(భార్య)-నేను మా రూంలో నిద్రపోతుంటే.. అభయ్ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు అనిపించి వచ్చి చూశాం. చేతిలో స్వామి కీ చైన్ పట్టుకుని దేవుడితో మాట్లాడుతూ కనిపించాడు. తనతో పాటు ఇంటికి వచ్చేయమని వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాడు. ఇదంతా చూసి నాకు చాలా ముద్దుగా అనిపించింది. ఈ రోజు ఉదయం దర్శనం ముగిసిన తర్వాత బయటకొచ్చేస్తుంటే అయ్యగారు(దేవుడు) నుంచి మరోసారి పిలుపు వచ్చింది. దాదాపు 10 నిమిషాల పాటు గర్భగుడిలో కూర్చున్నాం. ఇదంతా అనిర్వచనీయమైన అనుభూతి. అభయ్ కి దేవుడి ఇచ్చిన బహుమతిలా అనిపించింది. నమో వెంకటేశాయ' అని శైలేష్ కొలను రాసుకొచ్చాడు.
స్వతహాగా డాక్టర్ అయిన శైలేష్ కొలను.. ఆస్ట్రేలియాలో జాబ్ చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తితో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. 2020లో 'హిట్' మూవీతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత హిట్ 3, సైంధవ్, తాజాగా హిట్ 3 చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాడు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించనున్నాడు.
(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా)
Had the best darshan of my life at Tirumala today. Thanks to Abhay. Swathi and I were in our room last night and suddenly heard Abhay talking something. We were surprised to see him hold a swamy keychain in his hand and talking to it asking the lord to come home with him and live… pic.twitter.com/6grOp80qvy
— Sailesh Kolanu (@KolanuSailesh) May 8, 2025