యాక్షన్‌ థ్రిల్లర్‌

Grandhalayam movie will release on march 3rd - Sakshi

విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా సాయిశివన్  జంపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రంథాలయం’. ఎస్‌.వైష్ణవి శ్రీ  నిర్మించిన ఈ సినిమా మార్చి 3న రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకులు బి.గోపాల్, కాశీ విశ్వనాథ్, నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ విడుదల చేశారు.

‘‘కమర్షియల్‌ యాక్షన్  థ్రిల్లర్‌ చిత్రమిది. ట్రైలర్‌ రిలీజయ్యాక  సినిమాపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ గ్రూప్‌లలో మా ట్రైలర్‌  వైరల్‌గా మారింది’’ అన్నారు సాయిశివన్  జంపాన, ఎస్‌.వైష్ణవి శ్రీ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top