
విప్లవ చిత్రాల దర్శకునిగా ఎంతో పేరు సంపాదించారు దర్శకుడు ధవళ సత్యం. అక్టోబర్ 3న ఆయన సతీమణి శ్రీమతి సీతారత్నం అనారోగ్యంతో మరణించారు. జాతర, ఎరమల్లెలు, యువతరం కదిలింది వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను టాలీవుడ్లో ఆయన తెరకెక్కించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత 6వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మరోక కుమారుడు నర్సాపూర్లో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నట్లు సమాచారం.