NBK 107 Movie Update: బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి..!
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఎన్బీకే107 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈనెల 21 కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై ఆవిష్కరించనున్నారు. దీపావళి కానుకగా నందమూరి అభిమానులకు టైటిల్ లోగోను విడుదల చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం.. మరోసారి 'ఎన్బీకే 107'తో ప్రేక్షకులను అలరించనున్నారు.
(చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!)
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
The MASS euphoria intensifies 🔥#NBK107 title launch on the iconic Konda Reddy Buruju, Kurnool on October 21st at 8:15 PM ❤️🔥
NATASIMHAM #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/Qe6zPYrVgp
— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2022