Anchor Shyamala Shares Her New Home Bhoomi Pooja Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Syamala: ఏడాది తిరక్కుండానే యాంకర్‌ మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’

Mar 4 2023 3:33 PM | Updated on Mar 4 2023 4:06 PM

Anchor Shyamala Shares Her New Home Bhoomi Pooja Photos Goes Viral - Sakshi

యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌ ప్రముఖ యాంకర్లలో ఆమె ఒకరు. యాంకర్‌గానే కాదు నటిగానూ ఆమె గుర్తింపు పొందింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్‌ చేస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తు రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త కూడా నటుడనే విషయం తెలిసిందే. టీవీ నటుడు యువరాజ్‌(అలియాస్‌ నరసింహా)ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కూడా యాంకర్‌గా రాణిస్తున్న శ్యామల తాజాగా మరో కొత్త ఇంటికి శ్రీకారం చుట్టింది.

చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..

గతేడాది ఓ లగ్జరీ ఇంటిని కోనుగోలు చేసిన ఆమె ఏడాది తిరక్కుండానే మరో ఇంటిని నిర్మించడంపై నెటిజన్ల నుంచి రకరకాలుగా ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కొత్త ఇంటి కోసం భూమి పూజ చేసిన ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది. దీనికి ‘మేము కట్టబోయే కొత్త ఇంటికి భూమి పూజ చేశాం’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో రీసెంట్‌గానే కదా కొత్త ఇల్లు కొన్నావ్‌, ఆప్పుడే మరో ఇల్లా? అంత డబ్బు ఎక్కడిది అంటూ తనపై పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: పెళ్లిలో మోహన్‌ బాబును చూసి ఎమోషనల్‌ అయిన మౌనిక రెడ్డి

ఈ ఫొటోల్లో శ్యామల తన భర్త నరసింహా, కొడుకుతో కలిసి భూమి పూజ చేసింది. కాగా గతేడాది జులైలో ఆమె లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హోంటూర్‌ చేసి తన సొంతింటి కల నెరవేరిందంటూ  కొత్త ఇంటిని చూపిస్తూ మురిసిపోయింది. ఇప్పుడు తాజా మరో మరో కొత్త ఇంటి కోసం నిర్మాణం చేపట్టడంతో యాంకర్‌ శ్యామల వార్తల్లో నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement