-
11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్తున్నావా? అన్నారు: శ్యామల
బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్లో విలన్గా నటించింది శ్యామల. తర్వాత మైక్ పట్టి యాంకరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. ఇటీవల వచ్చిన విరూపాక్షలోనూ ముఖ్య పాత్ర పోషించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను చాలా త్వరగా ప్రేమలో పడ్డాను. 19 ఏళ్లకే కులాంతర వివాహం చేసుకున్నాను. అమ్మానాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా మామయ్య వాళ్లు ఇంట్లో శుభలేఖ ఇచ్చి పిలిచారు. కానీ ఎవరూ రాలేదు. ఇప్పటికీ ఈ విషయంలో నేను బాధపడుతూనే ఉంటాను. నా పెళ్లి మా అమ్మ చూడలేదు.. అదే నా జీవితంలో మిగిలిపోయిన లోటు. ఆమెను ఎలాగోలా ఒప్పించి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఉండుంటే బాగుండేదనిపిస్తుంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత మా అమ్మ ఒక రోజు సడన్గా ఇంటికి వచ్చింది. తనను చూసి ఒక్కసారిగా నేను షాకయ్యాను. నా భర్త గురించి, ఆయన కుటుంబం గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నా దగ్గరికి వచ్చింది. నాకు కొడుకు పుట్టిన తర్వాత రాకపోకలు మరింత పెరిగాయి. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నరసింహ నా ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోడు. ఇద్దరం మా పని మేము చేసుకుంటాం. నేను ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. బాబు పుట్టాక గ్యాప్ వచ్చింది. ఇషాన్కు 11 నెలల వయసున్నప్పుడు బిగ్బాస్ 2 ఆఫర్ వచ్చింది. అలా ఆ రియాలిటీ షోకి వెళ్లాను. అప్పుడు నాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇంత చిన్న బాబును వదిలేసి డబ్బు కోసం వెళ్తున్నావా? అని నానామాటలు అన్నారు. కానీ నేనేంటో మా ఫ్యామిలీకి తెలుసు, కాబట్టి ఆ మాటలను నేను పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో జరిగిన షాకింగ్ సంఘటన.. ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టడం. ఆమె నాకు తెలుసు. మా ఇంటికొస్తే నా చేతితోనే భోజనం వండి పెట్టాను. చివరకు ఆమె నా భర్త మీదే చీటింగ్ కేసు పెట్టింది. తనతో మాట్లాడాలన్నా నాకు మనసు విరిగిపోయింది. నా భర్త మోసం చేసే వ్యక్తి కాదు. అలాంటిది ఇంత పెద్ద ఆరోపణ మోపింది. ఆయన ఏ తప్పూ చేయలేదు. చివరకు అదే రుజువైంది. మన అనుకునేవాళ్లు కూడా వెన్నుపోటు పొడుస్తారని అప్పుడే అర్థమైంది' అని చెప్పుకొచ్చింది శ్యామల. చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక రియాక్షన్ ఏంటంటే? -
లండన్లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
లండన్లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
Anchor Syamala Photos: ఏడాది తిరగకముందే మరో ఇల్లు కడుతున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
మరో కొత్త ఇల్లు కట్టబోతున్న యాంకర్ శ్యామల.. భర్తతో కలిసి భూమి పూజ..
యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఆమె ఒకరు. యాంకర్గానే కాదు నటిగానూ ఆమె గుర్తింపు పొందింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్ చేస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తు రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త కూడా నటుడనే విషయం తెలిసిందే. టీవీ నటుడు యువరాజ్(అలియాస్ నరసింహా)ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కూడా యాంకర్గా రాణిస్తున్న శ్యామల తాజాగా మరో కొత్త ఇంటికి శ్రీకారం చుట్టింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. గతేడాది ఓ లగ్జరీ ఇంటిని కోనుగోలు చేసిన ఆమె ఏడాది తిరక్కుండానే మరో ఇంటిని నిర్మించడంపై నెటిజన్ల నుంచి రకరకాలుగా ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కొత్త ఇంటి కోసం భూమి పూజ చేసిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది. దీనికి ‘మేము కట్టబోయే కొత్త ఇంటికి భూమి పూజ చేశాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో రీసెంట్గానే కదా కొత్త ఇల్లు కొన్నావ్, ఆప్పుడే మరో ఇల్లా? అంత డబ్బు ఎక్కడిది అంటూ తనపై పోస్ట్పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి ఈ ఫొటోల్లో శ్యామల తన భర్త నరసింహా, కొడుకుతో కలిసి భూమి పూజ చేసింది. కాగా గతేడాది జులైలో ఆమె లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హోంటూర్ చేసి తన సొంతింటి కల నెరవేరిందంటూ కొత్త ఇంటిని చూపిస్తూ మురిసిపోయింది. ఇప్పుడు తాజా మరో మరో కొత్త ఇంటి కోసం నిర్మాణం చేపట్టడంతో యాంకర్ శ్యామల వార్తల్లో నిలిచింది. View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement