జైపూర్: పోలీస్ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీసుస్టేషన్ను తనిఖీ చేశారు. సీజ్ చేసిన వాహనాలు, రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, మత్తుపదార్థాల నిర్మూలన, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రాత్రి పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్కుమార్, ఎస్సై భూమేశ్ పాల్గొన్నారు.


