మంచిర్యాలలో రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాహనాల పార్కింగ్ సమస్య శాశ్వత తొలగింపునకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలపై ఈ–చలాన్ ద్వారా ఫైన్లు వేస్తున్నాం. మార్కెట్ రోడ్లో కార్లు, ఆటోలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ త్వరలో ప్రారంభిస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్లపై పార్కింగ్ చేయకుండా సహకరించాలి.
– ఎండీ.హన్నన్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల


