హైటెక్సిటీ కాలనీలో పాఠశాలకు ఎకరం స్థలాన్ని కేటాయించగా, ఇటీవల దానిని ప్లాట్లు చేసి అమ్మేందుకు చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్కు 2024లోనే భూమి పూజ చేస్తే, ఇప్పటికీ నిర్మాణ పనులు జరగడం లేదు. ఈ రెండు స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు కమిటీ వేయాలి.
– సురభి రవికుమార్, హైటెక్సిటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
కమ్యూనిటీ హాల్
స్థలం కాపాడాలి
హైటెక్సిటీ కాలనీలో 5 వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. అందరికి ఉపయోగకరంగా ఉండాలని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 2024లోనే భూమిపూజ చేసి వదిలేశారు. ఇప్పటికీ అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టక పోవడంతో ఆ స్థలం కబ్జా అయ్యే ప్రమాదం ఉంది. స్థలాన్ని కాపాడాలి.
– తోట తిరుపతి, హైటెక్సిటీ కాలనీ
వాస్తవ్యుడు


