మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.అశోక్కుమార్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీజీహెచ్లో పనిచేసిన ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ గత నెల 8వ తేదీన బదిలీపై వెళ్లగా, సూపరింటెండెంట్ స్థానం నెలరోజులకు పైగా ఖాళీగా ఉంది. దీంతో అశోక్కుమార్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


