సింగరేణిని దోచుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణిని దోచుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

Jul 15 2026 12:17 AM | Updated on Jul 15 2026 12:17 AM

● మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ గతంలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పాలన అంతా స్కాములమయమైతే మోదీ పాలనలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. కేసీఆర్‌ పాలనలోనే సింగరేణికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ● బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమాయ్యయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుని ఆ నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రా వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవటానికి కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. ● ఈ కార్యక్రమాల్లో ఎంపీ గెడం నగేశ్‌, ఎమ్మెల్యేలు పాయల శంకర్‌, రామారావుపటేల్‌, వెంకటరమణారెడ్డి, దన్‌ఫాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌రావు, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, బీఎంఎస్‌ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యాదగిరి సత్తయ్య, మాధవ్‌నాయక్‌, బ్రాంచీ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ గాజుల ముకేశ్‌గౌడ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ఆ రెండు పార్టీలకు లేదు వచ్చే నెల మరో శుభవార్త వినిపిస్తా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి

శ్రీరాంపూర్‌/రామకృష్ణాపూర్‌: సింగరేణి సంస్థను గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకోగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాలోని శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్సార్పీ–3 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. క్యాతనపల్లిలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సభలోనూ ఆయన ప్రసంగించారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కంపెనీలో 70వేల మంది కార్మికులు ఉంటే నేడు 38వేలకు చేరారని అన్నారు. 51శాతం వాటాతో సింగరేణిలో నిర్ణయాధికారాలను రాష్ట్రం ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని పెత్తనం చేస్తోందని తెలిపారు. నాడు కేసీఆర్‌ కుటుంబం, నేడు రేవంత్‌ సర్కార్‌ సింగరేణిని బంగారు బాతును చేసి పంచుకున్నాయని అన్నారు. సింగరేణి వద్ద ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బొగ్గు కొనుగోలు చేసి సక్రమంగా డబ్బులు చేల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. నెల వేతనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక బ్యాంకుల వద్దకు అప్పులకు వెళ్తోందని అన్నారు. తాడుచెర్ల–2 బొగ్గుబ్లాక్‌తో సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని తెలిపారు. ఇందులో 350 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు వెలికితీయవచ్చని, రెండు వేల మంది శాశ్వత, ఆరు వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయని, 45 ఏళ్లు కొనసాగుతుందని వివరించారు. వచ్చే నెలలో కూడా సింగరేణికి శుభవార్త చెబుతానని హామీనిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి టీబీజీకేఎస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement