అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలన్నారు. రూ.వేల పెట్టుబడితో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సూచించారు.
సాధ్యాసాధ్యాలను
పరిశీలించాలి..
కేఎల్ఐ ప్రాజెక్టు తో నియోజకవర్గ పరిధిలోని రైతుల కు సాగునీరు ఇ వ్వడానికి గల సాఽ ద్యాసాధ్యాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించాలి.నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నీటితో నింపే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులు కొంత సహకరించి నీటిని విడుదల చేస్తే ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
– తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే


