ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఎం.జాకీర్కు సొంత భూమి ఐదు ఎకరాలు ఉండగా... 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. టమాట, పత్తి, కంది వంటి పంటలు సాగు చేయగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్నీ దెబ్బతిన్నాయి. అప్పులు పెరిగిపోవడంతో 2024 అక్టోబరు 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను త్రీమెన్ కమిటీ నిర్ధారించింది. జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా.. వ్యవసాయ శాఖ కమిషనరేట్లో పెండింగ్లో ఉంది. ఈయనకు భార్య సుబాన్బీ, కుమార్తె సాదియా(13), కుమారుడు మస్తాన్వలి(8) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి తల్లి పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి.


