కరువు సీమ ఎండుతోంది. వరుణుడు ముఖం చాటేయడంతో పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కళ్ల ముందే వాడుతుండటం అన్నదాతను కలవరపెడుతోంది. ఈరోజు, రేపు అనే ఎదురుచూపులతో రోజులు గడుస్తున్నాయే కానీ వర్షం కురుస్తుందన్న నమ్మకం లేకుండాపోతోంది. ఆశ చావక కొందరు మళ్లీ వేలాది రూపాయలు పోసి ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కరువు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముందస్తు సాగు చేసిన రైతులు చినుకు జాడలేక పెట్టుబడులు నేలపాలై కన్నీరుమున్నీరవుతున్నారు. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
పంటను కాపాడుకునేందుకు మొక్కలకు నీళ్లు స్ప్రే చేస్తున్న
రైతు రామాంజినేయులు


