వేతన వేదన | - | Sakshi
Sakshi News home page

వేతన వేదన

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

వేతన వేదన శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026 లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికుల ఆకలి కేకలు కూటమి పాలకుల చెవికెక్కడం లేదు. కార్మికుల జీతాల నిధులు విడుదలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. ఇప్పటికే 8 నెలలుగా బిల్లులు విడుదల చేయక పోవడంతో కాంట్రాక్టు సంస్థలకు భారంగా మారి జీతాలు చెల్లించలేని దయనీయ స్థితికి చేరుకున్నాయి. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌, డైట్‌, ఆక్సిజన్‌ సరఫరా, లినెన్‌ క్లాత్‌(బెడ్‌షీట్స్‌) వీటన్నింటినీ ప్రయివేటు కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటికి ప్రతినెలా రూ.2.50 కోట్ల వరకూ అవసరం అవు తుంది. సుమారు 400 మంది సిబ్బంది పని చేస్తారు. కాంట్రాక్టు ఇచ్చే సమయంలో ప్రభుత్వం వెసులుబాటును బట్టి నిధులు విడుదల చేస్తుందనే కండిషన్‌ విధించింది. రెండు, మూడు నెలలు జాప్యమైతే సొంత నిధులు వెచ్చించి కాంట్రాక్టు సంస్థలు కార్మికులకు జీతాలు చెల్లించేవారు. ప్రస్తుతం ఎనిమిది నెలలుగా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయక పోవడంతో వారికి భారంగా మారింది. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా ఐదు నెలలు జీతాలు ఇచ్చామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అలా చూసినా కార్మికులకు మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నట్టే. గత ప్రభుత్వంలో ఇలా.. గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. వైద్యశాఖకు చెందిన బిల్లుల విడుదలలో జాప్యం జరిగేది కాదని చెబుతున్నారు. ఆ ఐదేళ్లూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహక సంస్థలు జీతాలు చెల్లించాయంటున్నారు. కానీ ఇప్పుడు జీతాల కోసం విధులు బహిష్కరించి రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

జీతాల కోసం రోడ్డెక్కాల్సి వస్తోంది

కార్మికులు ప్రతినెలా జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దయనీయస్థితి నెలకొంటోంది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి ఉండదు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయినా ఏడు నెలల పాటు బిల్లులు పెండింగ్‌ పెట్టడం కూడా సరికాదు. ప్రభుత్వం కార్మికుల జీతాలకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలి.

చంద్రబాబు సర్కార్‌ చెవికెక్కని కార్మికుల గోడు

జీతాలు చెల్లించండి మహాప్రభో అంటున్న కార్మికుల గోడు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. ఆస్పత్రి నుంచి కార్మికులు మూకుమ్మడిగా కలెక్టరేట్‌కు వచ్చి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు. మరోవైపు వైద్య విద్య సంచాలకులతో పాటు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. జీతాల నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యాన్ని వీడలేదు.

దుర్గమ్మ సేవలో..

కూటమి పాలనలో

కార్మికుల ఆకలి కేకలు

జీజీహెచ్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ

వంటి బిల్లులు ఎనిమిది

నెలలుగా పెండింగ్‌

జీతాల కోసం రోడ్డెక్కుతున్న

పారిశుద్ధ్య కార్మికులు

చంద్రబాబు సర్కార్‌ తీరుపై

కార్మిక సంఘ నేతల ఆగ్రహం

– పుప్పాల కృష్ణ, సీఐటీయూ నేత

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ సీసీఎల్‌ఏ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి శుక్రవారం దర్శించుకున్నారు.

జీజీహెచ్‌లో ప్రతి ఉదయం వార్డులను శుభ్రం చేస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించే చేతులే.. ఇంటికి వెళ్లాక తమ పిల్లలకు ఒక్క పూట భోజనం ఎలా పెట్టాలా అని ఆవేదన చెందుతున్నాయి. నెలలు గడుస్తున్నా జీతాలు అందక అద్దె చెల్లించలేక, పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేక, అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వందలాది కార్మికుల జీవితం దయనీయంగా మారింది. ఆస్పత్రి సేవలు ఆగకుండా కష్టపడుతున్న వారికి మాత్రం జీతాలు అందడం లేదు. ఎనిమిది నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టు సంస్థలు కూడా చేతులెత్తేయగా, చివరకు తమ కష్టానికి ప్రతిఫలం అడగడానికి కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement