● రమణీయంగా జన్మాష్ణమి సంబరాలు
యశవంతపుర: ఉడుపిలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి పర్యాయ మఠాధిపతి శిరూరు వేదవర్ధన తీర్థ, కృష్ణాపుర విద్యాసాగర తీర్థస్వామి గర్భగుడిలో కృష్ణుని విగ్రహానికి విశేష పూజలు చేశారు. తరువాత వేల సంఖ్యలో భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శనివారం జన్మాష్టమిలో భాగంగా శ్రీకృష్ణ లీలోత్సవం, విట్లపిండి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉట్టి వేడుకల్లో యువకులు పోటీలు పడ్డారు. అలాగే హుబ్లీలోనూ బాలలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, యువకుల ఉట్టి కొట్టే వేడుకలు ఆకట్టుకున్నాయి.


