విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు డిమాండ్‌

Sep 9 2026 12:05 AM | Updated on Sep 9 2026 12:05 AM

హొసపేటె: దావణగెరెలోని పీయూ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని రంజిత తన హాస్టల్‌ గదిలో ఇటీవల అనుమానాస్పదంగా మరణించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజయనగర జిల్లా గంగామతస్తుల సంఘం డిమాండ్‌ చేసింది. జిల్లాధికారిణి కార్యాలయం ముందు నిరసన తెలిపిన గంగామత సమాజ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. రంజిత చాలా ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని, ఆమెకు ఎలాంటి శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఉరి వేసుకుని మరణించడం అనేక అనుమానాలకు దారి తీసిందని, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఒత్తిడి చేశారు. యమనూరప్ప, శ్రీధర్‌, వై.రాజేష్‌, జంబయ్య, రామప్ప కబ్బేర్‌, వీరేష్‌, ఉమాపతి, ఎం.దానప్ప, ఎన్‌.అనిల్‌, ఎం.మారియప్ప, కే.నింగప్ప, సూర్యనారాయణ, శివకుమార్‌, బెండిగేరి లింగరాజు, మంజప్ప భోవి, హాలప్ప భోవి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement