భారతీయ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జాని మరియు సందీప్ ఖోస్లా (Abu Jani Sandeep Khosla) తమ ఫ్యాషన్ ప్రయాణంలో 40 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఒక అద్భుతమైన ప్రత్యేక కార్యక్రమాన్ని (40th Anniversary Celebration) ఘనంగా నిర్వహించారు.
ఈ 40 ఏళ్ల పండుగను పురస్కరించుకుని సౌత్ ముబైలోని చారిత్రాత్మక ఫ్రామ్జీ కావాస్జీ ఇన్స్టిట్యూట్లో 20,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ 'ముబారక్ బాగ్'ను వారు ప్రారంభించారు.
నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ మరియు రాధికా మర్చంట్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరంతా అబు జాని సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన సంప్రదాయ శైలి దుస్తులలో మెరిసిపోయారు.
సోనమ్ కపూర్, డింపిల్ కపాడియా, జయ బచ్చన్, రితీష్ దేశ్ముఖ్ - జెనీలియా జంట, ఆశా పరేఖ్ వంటి ఎంతోమంది నటీనటులు విచ్చేశారు.
(Images Source : Instagram/abujanisandeepkhosla)


