హొసపేటె: జాతీయ రహదారి–50పై అశాసీ్త్రయ, అజాగ్రత్తగా పనులు చేపట్టడంతో ఆదివారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. సిద్ధాపుర గ్రామానికి చెందిన యువకుడు నగేష్.. అర్ధరాత్రి బైక్పై వస్తూ అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో గాయపడటంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపైకి భారీగా తరలివచ్చిన సిద్దాపుర గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆగ్రహంతో బైక్కు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
గ్రానైట్ లారీ సీజ్
క్రిష్ణగిరి: రాజస్థాన్ నుంచి తమిళనాడుకు అనుమతి లేక గ్రానైట్ రాళ్లు తీసుకొస్తున్న కంటైనర్లారీని ఖనిజ సంపద శాఖాధికార్లు సీజ్ చేశారు. శనివారం రాత్రి క్రిష్ణగిరి – కుప్పం రోడ్డులోని వరటనపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. కంటైనర్ లారీని అడ్డగించి పరిశీలించగా రాజస్థాన్ నుండి తమిళనాడుకు అనుమతి లేకుండా విలువైన గ్రానైట్ రాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. లారీని స్వాధీనపరుచుకొని కందికుప్పం పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


